Breaking News

Urea supply in the state is good

రాష్ట్రంలో యూరియా సరఫరా మెరుగ్గానే ఉంది

రాష్ట్రంలో యూరియా సరఫరా మెరుగ్గానే ఉంది – మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

హైదరాబాద్: రాష్ట్రంలో యూరియా కొరత లేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం యూరియా కొరత గురించి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసిన మంత్రి, రైతాంగాన్ని ఆందోళనకు గురిచేయడం అనాగరిక చర్య అని అభిప్రాయపడ్డారు.

“యూరియా కొరతపై దుష్ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్”

  • ఒక్కో చోట జరిగిన చిన్న సంఘటనలను రాష్ట్రవ్యాప్తంగా యూరియా కొరతగా చిత్రీకరించడమే బీఆర్ఎస్ నేతల ఎజెండా అని విమర్శించారు.
  • రైతుల పాస్ బుక్కులు, ఆధార్ కార్డులు లైన్లో పెట్టించి దృశ్యాలు తీసి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం బాధాకరం అని వ్యాఖ్యానించారు.
  • మహబూబాబాద్ జిల్లాలో పోలీసులు టోకెన్లు జారీ చేశారనడం కూడా అవాస్తవమే అని ఖండించారు.

“యూరియా నిల్వలు, సరఫరా పరిస్థితి”

  • గత యాసంగి కాలంతో పోలిస్తే ఈసారి 1.91 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అధికంగా పంపిణీ చేశాం.
  • ప్రస్తుతం రాష్ట్రంలో 1.14 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయి.
  • ఈ నెలలో 40 వేల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులోకి వస్తుంది.
  • మార్చి నెలలో మరో 1.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరాకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపాం.

“రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలి”

  • యూరియా సరఫరాలో ఎక్కడైనా ఇబ్బంది ఉంటే సంబంధిత వ్యవసాయ అధికారులకు సమాచారం ఇవ్వాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
  • ప్రభుత్వం యూరియా పంపిణీ బాధ్యత తీసుకుంటుందని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
  • యూరియా కొరత వార్తలు సృష్టించడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న పార్టీలకు ఇది సరైన తగిన బుద్ధి కావాలి అని హెచ్చరించారు.

రైతుల సంక్షేమమే ప్రభుత్వానికి ప్రధాన లక్ష్యమని, ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

Tomorrow is a holiday
రేపు, ఎల్లుండి సెలవు

Reconstruction of the state is our goal: CM Chandrababu
రాష్ట్ర పునర్నిర్మాణం మా లక్ష్యం: సీఎం చంద్రబాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *