ఏప్రిల్ 09, నేటి తెలుగు పత్రిక: ఇరాన్తో జరుగుతున్న ఉద్రిక్తతల మధ్య అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠిన హెచ్చరికలు జారీ చేశారు. అణ్వాయుధాల అభివృద్ధిని పూర్తిగా నిలిపివేయాలని, హార్ముజ్ జలసంధిని తెరవాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ నిబంధనలపై కుదిరిన ఒప్పందాన్ని ఇరాన్ అమలు చేయకపోతే మళ్లీ యుద్ధానికి దిగుతామని ట్రంప్ స్పష్టం చేశారు. అవసరమైతే గతంలో ఎప్పుడూ లేనంత భారీ దాడులు చేస్తామని హెచ్చరించారు.ఇరాన్ పరిసర ప్రాంతాల్లో అమెరికా నౌకాదళం, సైనిక బలగాలు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఒప్పందం అమలయ్యే వరకు తమ బలగాలు అక్కడే మోహరించి ఉంటాయని వెల్లడించారు.ఈ పరిణామాలతో పశ్చిమ ఆసియా ప్రాంతంలో పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
