జూన్ 02, (నేటి తెలుగు పత్రిక): జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణపై తనకు ప్రత్యేకమైన అభిమానం ఉందని స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధి చెందాలని మాత్రమే కోరుకుంటానని, తనకు ఎలాంటి ఇతర ఉద్దేశాలు లేవని అన్నారు.
హైదరాబాద్లో తన కార్యక్రమాలపై కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్న ఆయన, తెలంగాణ ఎవరి వ్యక్తిగత ఆస్తి కాదని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు ఉందని చెప్పారు.
తనను బెదిరించే ప్రయత్నాలు చేసినా వెనక్కి తగ్గబోనని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో కూడా తాను ఎన్నో ఒత్తిళ్లు, విమర్శలు ఎదుర్కొన్నానని గుర్తు చేశారు.తెలంగాణతో తనకు భావోద్వేగ అనుబంధం ఉందని, ఈ నేలపై తనకు గౌరవం, ప్రేమ ఎప్పటికీ ఉంటాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
