ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ)ను అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. చట్టానా నియోజకవర్గంలో జరిగిన సభలో ఆయన ఈ హామీ ఇచ్చారు.అందరికీ ఒకే చట్టం అమలులోకి తీసుకువచ్చి సమాన హక్కులు కల్పించడమే లక్ష్యమని తెలిపారు. టీఎంసీ పాలనలో అవినీతి కారణంగా నష్టపోయిన యువతకు న్యాయం చేస్తామని, వారికి వయో సడలింపులు కల్పిస్తామని చెప్పారు.యూసీసీ అమలు బీజేపీ దీర్ఘకాలిక లక్ష్యమని పేర్కొంటూ, దేశవ్యాప్తంగా సమానత్వం సాధించడానికి ఇది కీలకమని అన్నారు. కేంద్ర స్థాయిలో పరిమితులు ఉన్నప్పటికీ, రాష్ట్రాల ద్వారా దశలవారీగా అమలు చేస్తామని స్పష్టం చేశారు.ఇప్పటికే కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో యూసీసీ అమలు దిశగా చర్యలు ప్రారంభమైనట్లు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కూడా ఈ అంశాన్ని ప్రధాన అజెండాగా తీసుకువెళ్తామని పేర్కొన్నారు.ప్రజల మద్దతుతో యూసీసీని అమలు చేసి సమాన న్యాయం సాధిస్తామని అమిత్ షా విశ్వాసం వ్యక్తం చేశారు.
