Breaking News

దేవాలయాల్లో అన్ని వర్గాలకు అవకాశం ఇవ్వాలి.. గర్భగుడి ప్రవేశంపై మంద కృష్ణ డిమాండ్

ఏప్రిల్ 13, నేటి తెలుగు పత్రిక: ఆలయాల్లో సమానత్వం ఉండాలని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. గర్భగుడిలో ప్రవేశం అందరికీ ఉండాలని, దేవాలయాల్లో వివక్ష కొనసాగడం సరికాదని ఆయన అన్నారు.రామానుజాచార్యులే నిజమైన సంఘ సంస్కర్త అని పేర్కొన్న మంద కృష్ణ, ఆయన ఆలోచనలే సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తాయని చెప్పారు. ఆలయ వ్యవస్థలో మార్పులు రావాలని, అన్ని వర్గాల వారికి పూజారి అవకాశాలు కల్పించాలని ఆయన సూచించారు.బ్రాహ్మణేతరులకు కూడా పూజారి అవకాశం ఇవ్వాలని, ఆలయ సేవల్లో సమాన భాగస్వామ్యం ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. అంబేద్కర్ భావజాలమే తమ డిమాండ్‌కు ఆధారమని స్పష్టం చేశారు.అయోధ్య ఆలయంలో కూడా అన్ని వర్గాల పూజారులకు అవకాశం ఉండాలని ఆయన కోరారు. దేవాలయాల్లో వివక్ష ఎందుకు కొనసాగుతోందని ప్రశ్నిస్తూ, సమానత్వం దిశగా వ్యవస్థ మారాల్సిన అవసరం ఉందని మంద కృష్ణ మాదిగ పేర్కొన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *