Breaking News

పారదర్శకంగా కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ పంపిణీ.. ప్రజా పాలనపై ప్రభుత్వ దృష్టి

ఏప్రిల్ 13, నేటి తెలుగు పత్రిక: మధ్యవర్తులకు అవకాశం లేకుండా కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కులను పారదర్శకంగా పంపిణీ చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ మొక్కవోని దీక్షతో ప్రజా పాలన కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు.పేద ప్రజల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. గత ప్రభుత్వ పాలనతో పోలిస్తే ప్రస్తుత ప్రజా పాలనలో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయని అన్నారు.సన్నబియ్యం పంపిణీతో పాటు నియోజకవర్గంలో అర్హులైన వారికి 3,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు తెలిపారు. అలాగే అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు అందజేస్తున్నట్లు వెల్లడించారు.నియోజకవర్గ అభివృద్ధిలో ఎలాంటి రాజీ లేకుండా ముందుకు సాగుతున్నామని అధికారులు స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమానంగా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, స్థానిక ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, మేయర్ ఉమారాణి, రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, కార్పొరేటర్లు తదితరులు హాజరయ్యారు.

అర్బన్ పార్కు మరమ్మతు పనులు ముమ్మరం.

మహిళా రిజర్వేషన్లపై రేవంత్ వ్యాఖ్యలు అవగాహనలోపం ఫలితమే: కిషన్‌రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *