కోదాడ ,ఏప్రిల్ 13(నేటి తెలుగు పత్రిక.): కోదాడ పట్నంలో ఉన్న ఉత్తమ్ పద్మావతి నగర్ అర్బన్ పార్క్ లో బోర్ వేయించిన కోదాడ మున్సిపల్ చైర్మన్ శ్రీమతి యేర్నెని కుసుమ వెంకటరత్నం బాబు .కోదాడ ఉత్తమ్ పద్మావతి నగర్ లో ని పార్క్ గత కొన్ని సంవత్సరాలు నిరూపయోగం లో ఉన్న ఈ పార్క్ ను 8వ వార్డ్ కౌన్సిలర్ శ్రీమతి ఉదయశ్రీ హరిప్రసాద్ అభ్యర్థన మేరకు పార్క్ ను శుభ్రం చేయించి పునరుద్దరణ ముందుకొచ్చారు. కోదాడ మున్సిపల్ చైర్మన్ శ్రీమతి యేర్నెని కుసుమ వెంకటరత్నం బాబుపార్క్ మొత్తం చెట్టు నాటించి, పచ్చదనాన్ని పెంచేందుకు నీటి వసతి కోసం ఈ రోజు పార్క్ లో బోర్ వేయించిన చైర్మన్ కు కౌన్సిలర్ రామ్ శెట్టి ఉదయశ్రీ హరిప్రసాద్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

