ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: యువ నటుడు వరుణ్ తేజ్ గాయపడిన నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. ‘బరి’ సినిమా కోసం ప్రాక్టీస్ చేస్తుండగా వరుణ్ తేజ్ మోకాలికి గాయమై శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే.ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ స్పందిస్తూ, వరుణ్ తేజ్ వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటూ, ఫిజియోథెరపీ సూచనలు కచ్చితంగా పాటించాలని సూచించారు. పూర్తిగా కోలుకొని మరింత ఉత్సాహంతో తిరిగి కెమెరా ముందుకు రావాలని ఆయన అభిలషించారు.అలాగే అభిమానులు, సినీ వర్గాల వారు కూడా వరుణ్ తేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోందని సమాచారం.సినిమా షూటింగ్కు తాత్కాలిక విరామం ఇచ్చిన వరుణ్ తేజ్, పూర్తిగా కోలుకున్న అనంతరం ‘బరి’ చిత్రాన్ని మళ్లీ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
