ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చిలకలడోణ సమీపంలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా ఆవేదన కలిగించింది. ఈ దుర్ఘటనపై రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.ప్రమాదంలో గాయపడిన వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో స్వయంగా పరామర్శించిన మంత్రి, వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. బాధితులకు తక్షణమే మెరుగైన వైద్యసేవలు అందించాలని డాక్టర్లను ఆదేశించారు. అవసరమైన చికిత్సలో ఎలాంటి లోటు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.అలాగే ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.ప్రమాదానికి గల కారణాలను గుర్తించి భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు మంత్రి సూచించినట్లు సమాచారం. ఈ ఘటనతో ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది.
