Breaking News

అభివృద్ధిని అడ్డుకోవొద్దు.. ప్రతిపక్షానికి లోకేశ్ హితవు

ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడం సరైంది కాదని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. పెట్టుబడులు, పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్న సమయంలో వాటిని ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిదని ఆయన పేర్కొన్నారు.ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై విమర్శలు గుప్పించిన లోకేశ్, అభివృద్ధికి దోహదపడే ప్రాజెక్టులను రాజకీయ కారణాలతో అడ్డుకోవడం ప్రజల ప్రయోజనాలకు విరుద్ధమని అన్నారు. ముఖ్యంగా రక్షణ రంగానికి ఉపయోగపడే ఆధునాతన బోట్ల తయారీ సంస్థ రాష్ట్రానికి రావడం గర్వకారణమని తెలిపారు.ఈ ప్రాజెక్ట్ ద్వారా స్థానిక యువతకు, ముఖ్యంగా మత్స్యకార కుటుంబాలకు చెందిన వారికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన వివరించారు. వెయ్యికి పైగా ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉన్నప్పుడు, అలాంటి ప్రాజెక్టులను వ్యతిరేకించడం సరికాదని అన్నారు.ప్రతిపక్షం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించిన లోకేశ్, అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి రాజకీయ లాభాల కోసం వ్యవహరించడం ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు.పెట్టుబడులు పెరిగితేనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని, యువతకు ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయని ఆయన పేర్కొన్నారు. పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

అనారోగ్యంతో బాధపడిన బాలికను పరామర్శించిన రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడు చందు జనార్దన్

మహిళలకు ద్రోహం చేయడం జాతికి ద్రోహమే: చంద్రబాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *