Breaking News

కాళేశ్వరం పునరుద్ధరణపై దృష్టి.. దురుద్దేశం లేదన్న మంత్రి

ఏప్రిల్ 17, నేటి తెలుగు పత్రిక: కాళేశ్వరం ప్రాజెక్టును మరమ్మతులు చేసి మళ్లీ వినియోగంలోకి తీసుకురావడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సుమారు రూ.97 వేల కోట్లతో నిర్మించిన ఈ ప్రాజెక్టు విషయంలో తమకు ఎలాంటి దురుద్దేశం లేదని స్పష్టం చేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో గత ప్రభుత్వ తప్పిదాలు ప్రజలకు తెలిసిన విషయమేనని పేర్కొంటూ, ప్రస్తుతం దాని పునరుద్ధరణపై చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. గోదావరి వరదలు వచ్చేలోపు సాయిల్ టెస్టింగ్, డిజైన్ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.ఈ అంశంపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్‌తో కూడా చర్చలు జరిపినట్లు మంత్రి వెల్లడించారు. ప్రాజెక్టును సక్రమంగా ఉపయోగంలోకి తీసుకురావడం ద్వారా రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిపారు.

స్టాండప్ కామెడీ వివాదం.. అనుదీప్ కటికలపై చర్యలకు ఆదేశాలు

బాయిల్డ్ రైస్ కొనుగోళ్లపై కేంద్రానికి తెలంగాణ విజ్ఞప్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *