Breaking News

సింగపూర్ చేరుకున్న మంత్రుల బృందానికి ఘన స్వాగతం

ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మంత్రుల బృందం ఈరోజు ఉదయం సింగపూర్ చేరుకుంది. మంత్రులు అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, సత్య కుమార్ యాదవ్, అనగాని సత్య ప్రసాద్, బి.సి. జనార్దన్ రెడ్డి ఈ బృందంలో ఉన్నారు.సింగపూర్‌లోని తెలుగు అసోసియేషన్ సభ్యులు మంత్రుల బృందానికి ఘన స్వాగతం పలికారు. పూలదండలతో, సాంప్రదాయ ఆతిథ్యంతో వారిని ఆహ్వానించారు.ఈ బృందం నేటి నుంచి ఏప్రిల్ 27 వరకు మొత్తం ఏడు రోజుల పాటు సింగపూర్‌లో అధికారిక పర్యటన చేయనుంది. ఈ సందర్భంగా అక్కడి ఆధునిక పరిపాలనా విధానాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధిని అధ్యయనం చేయనున్నారు.అదేవిధంగా, సింగపూర్ ప్రభుత్వం మరియు ప్రపంచ బ్యాంక్‌తో కలిసి అమలు చేస్తున్న ‘సింగపూర్-ఏపీ జాయింట్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ వరల్డ్ క్లాస్’ కార్యక్రమం కింద నిర్వహించే ‘ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్’ (ToT) శిక్షణలో మంత్రులు పాల్గొననున్నారు. ఈ శిక్షణలో సింగపూర్ పాలన నమూనా, రాజకీయ జవాబుదారీతనం, ‘నేషన్ ఫస్ట్’ వంటి నాయకత్వ సూత్రాలపై అవగాహన కల్పించనున్నారు.ఈ పర్యటన ద్వారా రాష్ట్రంలో పరిపాలనలో మెరుగులు తీసుకురావడం, అభివృద్ధి కార్యక్రమాలకు కొత్త దిశను ఇవ్వడం లక్ష్యంగా మంత్రులు ముందుకు సాగుతున్నట్లు అధికారులు తెలిపారు.

భగీరథుని స్ఫూర్తితో జల సంరక్షణకు ప్రభుత్వం కట్టుబాటు

సింగపూర్ పర్యటనలో ఏపీ మంత్రుల బృందం.. ఆధునిక పోర్టు వ్యవస్థలపై అధ్యయనం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *