ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్కు చెందిన మంత్రుల బృందం ఈరోజు ఉదయం సింగపూర్ చేరుకుంది. మంత్రులు అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, సత్య కుమార్ యాదవ్, అనగాని సత్య ప్రసాద్, బి.సి. జనార్దన్ రెడ్డి ఈ బృందంలో ఉన్నారు.సింగపూర్లోని తెలుగు అసోసియేషన్ సభ్యులు మంత్రుల బృందానికి ఘన స్వాగతం పలికారు. పూలదండలతో, సాంప్రదాయ ఆతిథ్యంతో వారిని ఆహ్వానించారు.ఈ బృందం నేటి నుంచి ఏప్రిల్ 27 వరకు మొత్తం ఏడు రోజుల పాటు సింగపూర్లో అధికారిక పర్యటన చేయనుంది. ఈ సందర్భంగా అక్కడి ఆధునిక పరిపాలనా విధానాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధిని అధ్యయనం చేయనున్నారు.అదేవిధంగా, సింగపూర్ ప్రభుత్వం మరియు ప్రపంచ బ్యాంక్తో కలిసి అమలు చేస్తున్న ‘సింగపూర్-ఏపీ జాయింట్ ఇన్స్టిట్యూట్ ఫర్ వరల్డ్ క్లాస్’ కార్యక్రమం కింద నిర్వహించే ‘ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్’ (ToT) శిక్షణలో మంత్రులు పాల్గొననున్నారు. ఈ శిక్షణలో సింగపూర్ పాలన నమూనా, రాజకీయ జవాబుదారీతనం, ‘నేషన్ ఫస్ట్’ వంటి నాయకత్వ సూత్రాలపై అవగాహన కల్పించనున్నారు.ఈ పర్యటన ద్వారా రాష్ట్రంలో పరిపాలనలో మెరుగులు తీసుకురావడం, అభివృద్ధి కార్యక్రమాలకు కొత్త దిశను ఇవ్వడం లక్ష్యంగా మంత్రులు ముందుకు సాగుతున్నట్లు అధికారులు తెలిపారు.



