Breaking News

నారాయణపేటలో లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కైన ఆర్డీవో

నారాయణపేట, ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): జనన ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడానికి లంచం తీసుకుంటూ ఆర్డీఓ ఏసీబీకి చిక్కిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆర్డీఓ రాంచందర్ నాయక్ రూ.25 వేల లంచం స్వీకరిస్తూ అధికారుల చేతికి చిక్కారు.ఊట్కూర్ మండలానికి చెందిన వ్యక్తి సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకోగా, వాటిని జారీ చేయడానికి డబ్బు ఇవ్వాలని ఆర్డీఓ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో వారు పక్కా ప్రణాళిక రూపొందించారు.ఆ ప్రణాళిక ప్రకారం బాధితుడు కార్యాలయంలోనే లంచం ఇవ్వగా, వెంటనే దాడి చేసిన ఏసీబీ అధికారులు ఆర్డీఓను పట్టుకున్నారు. అనంతరం అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అధికారులు, ఆర్డీఓ నివాసంలో కూడా తనిఖీలు నిర్వహించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు.

బీజేపీ కార్యాలయానికి మల్లారెడ్డి కోడలు ప్రీతి.. రాజకీయాల్లో చర్చ

ఆర్టీసీ సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు విమర్శలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *