Breaking News

రేపు ఉదయం 11కి ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల: మంత్రి నారా లోకేష్

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఏపీ టెన్త్ క్లాస్ ఫలితాలను ఏప్రిల్ 30న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు.ఫలితాలను విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చని తెలిపారు. హాల్ టికెట్ నంబర్ నమోదు చేస్తే వెంటనే ఫలితాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.ఇక డిజిటల్ సౌకర్యాలను విస్తరించేందుకు వాట్సాప్ సేవను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ‘మనమిత్ర’ నంబర్‌కు మెసేజ్ పంపి కూడా ఫలితాలు తెలుసుకునే వీలుంటుందని మంత్రి వెల్లడించారు.అదేవిధంగా LEAP యాప్ ద్వారా కూడా మార్కులు, గ్రేడ్ వివరాలను పొందవచ్చని తెలిపారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ లాగిన్ ద్వారా విద్యార్థుల మార్కుల మెమోలను డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం కల్పించారు.ఫలితాల విడుదల ప్రక్రియను సాంకేతికంగా సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. విద్యార్థులు ఫలితాలపై ఎలాంటి సందేహాలు ఉన్నా సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

సీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *