ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని ఎల్అండ్టీ సంస్థ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.ఎన్. సుబ్రహ్మణ్యన్ మర్యాదపూర్వకంగా కలిశారు.హైదరాబాద్లోని తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగిన ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధి, మౌలిక వసతుల ప్రాజెక్టులపై చర్చ జరిగినట్లు సమాచారం.ఈ సమావేశం రాష్ట్రంలో జరుగుతున్న కీలక ప్రాజెక్టుల పురోగతికి సంబంధించి ప్రాధాన్యత సంతరించుకుంది.
