మే 11, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలులో విఫలమైందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి విమర్శించారు. హైదరాబాద్లో జరిగిన బీజేపీ సభలో మాట్లాడిన ఆయన.. రైతులు, మహిళలు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఇంకా పూర్తిగా అమలుకాలేదన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించిందని, జాతీయ రహదారులు, రైల్వేలు, వందేభారత్ రైళ్లు వంటి పలు ప్రాజెక్టులు కేంద్ర సహకారంతోనే జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేంద్రం చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు చెప్పకుండా రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు.
