Breaking News

Bhanu Prakash Reddy's involvement in the Tirumala Parakamani case

తిరుమల పరకామణి కేసులో భాను ప్రకాష్ రెడ్డి మండిపాటు

తిరుమల పరకామణి కేసులో భాను ప్రకాష్ రెడ్డి మండిపాటు

వైసీపీ పాలనపై తీవ్రమైన విమర్శలు

తిరుపతి: తిరుమల పరకామణి కేసుకు సంబంధించి గత ప్రభుత్వంలో టీటీడీ పై ఓ పోలీస్ అధికారి ఒత్తిడి తెచ్చాడని భాను ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. రాజీకి తీసుకెళ్లిన ఆ పోలీస్ అధికారి ఎవరో ప్రశ్నించారు. రూ.100 కోట్ల దోపిడీ జరిగినట్టు ఆరోపిస్తూ, క్లర్క్ స్థాయి వ్యక్తికి కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయనే విషయంపై కూడా ఆయన నిలదీశారు.

జగన్‌పై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు.. “వక్రీకరణ రాజకీయాలు చేస్తున్నారు”

భాను ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో రవి కుమార్ అనే వ్యక్తి పరకామణి చేస్తూ దొరికిపోయిన విషయం చెప్పినప్పటికీ, విజిలెన్స్ అతన్ని పట్టుకోవడం సంతోషకరమని అన్నారు. కానీ, డబ్బు రికవరీ చేయకుండా, పోలీసులు మరియు కొంతమంది బోర్డ్ మెంబర్లు అతన్ని కాపాడారనే ఆరోపణలు చేశారు.

భాను ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ, ఈ విషయంలో కొంతమంది గజ దొంగలు తమ స్వార్థం కోసం ప్లాన్ వేసారని, ఆర్‌ఆర్‌ఆర్‌లు ఉన్నారని, త్వరలోనే వారి పేర్లు బయటపెట్టబోతున్నట్లు హెచ్చరించారు.

భాను ప్రకాష్ రెడ్డి మరిన్ని వ్యాఖ్యానాలు చేస్తూ, స్వామి వారి సొత్తు తినడం అంగీకరించదగిన చర్య కాదని, ఈ విషయంలో విజిలెన్స్ ఆధ్వర్యంలో టీటీడీ ఈవో విచారణకు ఆదేశించినట్టు తెలిపారు. వైసీపీ ప్రభుత్వంపై దేవాలయాలను దోచుకోవడం అనే తీవ్ర విమర్శలు వ్యక్తం చేశారు.

హోంగార్డులకు ఉచిత ఆరోగ్య బీమా.. విశాఖలో సహాయ కేంద్రం ప్రారంభం: హోం మంత్రి అనిత

గత ప్రభుత్వం ఈ కేసును ఎందుకు నిర్లక్ష్యంగా పరిగణించిందని, భాను ప్రకాష్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *