మన్మోహన్ సింగ్ నేతృత్వంలో అనేక విప్లవాత్మక చట్టాలు: తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శాసనసభలో మాట్లాడుతూ, మన్మోహన్ సింగ్ హయాంలో వచ్చిన అనేక విప్లవాత్మక చట్టాలను గుర్తుచేశారు. ఆయన మాట్లాడుతూ, ‘‘మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉండగా, దేశాభివృద్ధికి ఎంతో కీలకమైన పథకాలు ప్రవేశపెట్టారు. న్యూక్లియర్ ఒప్పందం ద్వారా దేశ క్షేమం దృష్ట్యా ఆయన ప్రతిష్టాత్మక ఒప్పందాన్ని కుదుర్చారు. ఆయన మృతి దేశానికి తీరని లోటు’’ అన్నారు.
రైతులకు రుణమాఫీ ప్రకటించిన తొలి ప్రధాని మన్మోహన్ సింగ్ అని పేర్కొంటూ, ఆయన సోనియా గాంధీ సూచనల మేరకు అనేక గొప్ప చట్టాలను ప్రవేశపెట్టారని తెలిపారు. ‘‘గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఆయన ఆధ్వర్యంలో వచ్చినది. సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజలకు ప్రభుత్వ వ్యయాలపై అవగాహన కల్పించారు. ఆహార భద్రత చట్టం ద్వారా ఆకలి చావులు నివారించే ప్రయత్నం చేశారు’’ అని ఆయన పేర్కొన్నారు.
శ్రీధర్ బాబు వ్యాఖ్యలు
మंत्री శ్రీధర్ బాబు కూడా మన్మోహన్ సింగ్ నేతృత్వంలో వచ్చిన విధానాలను అభినందించారు. ‘‘ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ దేశాభివృద్ధికి ఎన్నో గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు. ఆయన పీవీ నరసింహారావు చేత ఆర్థిక మంత్రి అయ్యారు. ఉపాధి హామీ పథకం, ఆర్టీఐ వంటి చట్టాలు, ఆధార్ ద్వారా దేశ ప్రజలకు సేవలు అందించారు’’ అని తెలిపారు.
తెలంగాణ ఉద్యమంలో పాత్ర
శ్రీధర్ బాబు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడటలో మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పోషించారని, ఆయన హయాంలో ట్రిపుల్ ఐటీలు రాష్ట్రంలో స్థాపించబడ్డాయని తెలిపారు.
