|| I will be a best friend in the home of those who are struggling… ||
ప్రజల కష్టాల్లో భాగస్వామ్యమై సీఎం చంద్రబాబు పర్యటన:
పల్నాడు జిల్లా, యల్లమందలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. పింఛన్లు పంపిణీ చేసిన తర్వాత, ఆయన స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి, వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం, గ్రామ సభలో ప్రసంగించారు.
చంద్రబాబు మాట్లాడుతూ, “గత ఐదేళ్లు ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితిలో ఉండిపోయారు. కనీసం నవ్వలేకపోయారు. ఇప్పుడు ఇంటింటికీ వచ్చి పింఛన్లు అందిస్తున్నాం. జీపీఎస్ ద్వారా ఫోన్లో సమాచారం వస్తోంది. డ్రోన్లను కూడా సహాయ కార్యక్రమాల్లో ఉపయోగిస్తున్నాం. పేదవాళ్ల జీవితాల్లో వెలుగు చూడాలన్న నా లక్ష్యంతోనే నేను పనిచేస్తున్నాను. ఐదు కోట్ల మంది ప్రజల కోసమే నేను కష్టపడుతున్నాను. ఏ ఇంట్లో కష్టమొచ్చినా, వాళ్ల ఇంట్లో నేను ఒక ప్రాణ స్నేహితుడిగా ఉంటాను. నేను ఏం చేసినా, అందరికీ న్యాయం జరగాలని నా ఆలోచన” అని ఆయన అన్నారు.
పార్టీ గురించి మాట్లాడుతూ, “పార్టీ కోసం పనిచేసిన వారిని ఎప్పటికీ మరిచిపోలేను. 90 లక్షల మంది పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. మా పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు ఎప్పటికప్పుడు చెప్పాలి. కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.”
సీఎం చంద్రబాబు ఎప్పటికీ ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తామని స్పష్టం చేశారు.
