Breaking News

AP Cabinet meeting concluded

ముగిసిన ఏపీ కాబినెట్ భేటీ

ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు: అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్

రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యంగా అమరావతిలో రూ.2,733 కోట్లతో చేపట్టనున్న పనులు, సీఆర్డీఏ 44వ సమావేశంలో నిర్ణయించిన రెండు ప్రాజెక్టులకు ఆమోదం లభించింది.

విజయవాడ టెర్రర్ లింక్ కేసులో కొత్త మలుపు.. మహిళల రిక్రూట్‌మెంట్‌పై దర్యాప్తు

మున్సిపల్ చట్ట సవరణకు అంగీకారం
భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతుల జారీ అధికారాన్ని మున్సిపాలిటీలకు బదలాయించేందుకు చట్ట సవరణ ఆర్డినెన్స్కు కేబినెట్ అనుమతి ఇచ్చింది.

పిఠాపురం అభివృద్ధి ప్రణాళిక
పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో కొత్తగా 19 పోస్టుల ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
పారిశ్రామిక ప్రాజెక్టులు
రామాయపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ
కాకినాడలో గ్రీన్ అమ్మోనియా ప్లాంట్
ఈ రెండు ప్రాజెక్టులపై సమావేశంలో చర్చ జరగగా, వాటి అమలుకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
పునరుత్పాదక విద్యుత్ ప్రోత్సాహం
నంద్యాల, వైఎస్ఆర్, కర్నూలు జిల్లాల్లో పవన, సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు క్యాబినెట్ అంగీకారం తెలిపింది.
చిత్తూరు జిల్లాలో హోంశాఖ బెటాలియన్
చిత్తూరు జిల్లాలో ఐఆర్ బెటాలియన్ ఏర్పాటుకు అవసరమైన స్థల కేటాయింపు అంశంపై కేబినెట్ చర్చించింది.
ప్రభుత్వం దృష్టిలో ఉన్న అభివృద్ధి లక్ష్యం
ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, విద్యుత్ ఉత్పత్తి విభాగాల్లో పురోగతికి దోహదం చేస్తాయి.

కష్టపడిన వారిని గుర్తించాలనేది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం

ఇలాంటి ప్రాజెక్టుల ద్వారా రాష్ట్ర ఆర్థిక వృద్ధి మరింత వేగవంతం కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *