Breaking News

We have given ranks to compete and work: Chandrababu

మంత్రి వర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

మంత్రి వర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పనులపై సోమవారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఇరిగేషన్ శాఖ పనితీరుపై ప్రశంసలు, రెవిన్యూ శాఖపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇరిగేషన్ శాఖకు అభినందనలు

ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఇరిగేషన్ సెక్రటరీ, అధికారులను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు.

ఉపాధి హామీ లబ్ధిదారులకు అలర్ట్.. 48 గంటల్లోనే జాబ్ కార్డు జారీ.
  • రాష్ట్ర చరిత్రలో తొలిసారి 85 శాతం రిజర్వాయర్లు పూర్తిసామర్థ్యంతో నీటిని నిల్వ చేశారని తెలిపారు.
  • సాగు, తాగు నీటి అవసరాలకు వినియోగించిన తర్వాత కూడా 738 టీఎంసీలు, 75 శాతం నీటి నిల్వ ఉందని చెప్పారు.
  • “మంత్రి, అధికారులు కష్టపడి పనిచేస్తే ఫలితాలు బాగుంటాయి” అని చంద్రబాబు ప్రశంసించారు.

రెవిన్యూ అధికారులపై ఆగ్రహం

కానీ రెవిన్యూ శాఖ పనితీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు.

  • రెవిన్యూ సదస్సుల్లో సమస్యలు పరిష్కారం కావడం లేదని ఫీడ్‌బ్యాక్ అందిందని పేర్కొన్నారు.
  • “22A భూములు, ఇళ్ల స్థలాల సమస్యలు ఇప్పటికీ ఎందుకు పరిష్కారం కావడం లేదు?” అని అధికారులను నిలదీశారు.
  • ప్రజలు ఎన్ని రోజులు ఎదురుచూడాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా స్పందిస్తూ, సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయని హామీ ఇచ్చారు.

  • మంత్రి సత్యప్రసాద్ కూడా “ఇబ్బందులు పరిష్కరించి, పూర్తిస్థాయి రిపోర్ట్ అందిస్తాం” అని తెలిపారు.

ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించామని, ప్రజల సమస్యల పరిష్కారంపై సమర్థమైన చర్యలు తీసుకుంటామని సీఎం తెలిపారు.

ఏపీ ప్రభుత్వ పనితీరుపై బిల్ గేట్స్ ప్రశంసలు.. “గ్రేట్ వర్క్” అంటూ కితాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *