తెలంగాణ భవన్లో సావిత్రీబాయి ఫూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ
తెలంగాణ భవన్లో సంఘ సంస్కర్త సావిత్రీబాయి ఫూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని, సావిత్రీబాయి ఫూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, “బడుగుల అభ్యున్నతి, స్త్రీ విద్య కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయురాలు సావిత్రీబాయి ఫూలే. ఆమె ఆశయాలు మనకు నేటికీ స్ఫూర్తిగా నిలుస్తున్నాయి,” అని తెలిపారు.
వేడుకల్లో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పలువురు నాయకులు సావిత్రీబాయి ఫూలే జీవన దశలను స్మరించుకుంటూ, సమాజానికి ఆమె చేసిన అమూల్య సేవలను కొనియాడారు.
