Breaking News

Emergency meeting of BRS key leaders

బీఆర్ఎస్ కీలక నేతల అత్యవసర సమావేశం

నందినగర్‌లో బీఆర్ఎస్ కీలక నేతల అత్యవసర సమావేశం

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి టి.హరీష్ రావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితలు మంగళవారం నందినగర్‌లోని కేటీఆర్ నివాసంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఫార్ములా ఈ రేసు కేసు, తాజా రాజకీయ పరిణామాలు, హైకోర్టు తీర్పు నేపథ్యంలో వారు లీగల్ టీమ్‌తో భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర

హైకోర్టు తీర్పు నేపథ్యంలో చర్చలు
ఫార్ములా ఈ రేసు కేసులో తమపై నమోదైన ఏసీబీ కేసును కొట్టివేయాలంటూ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంతో, ఈ పరిణామంపై నేతలు వ్యూహాత్మకంగా స్పందించారు. ఏసీబీ ఇచ్చిన నోటీసుల ప్రకారం కేటీఆర్‌ను జనవరి 9న విచారణకు హాజరుకావాల్సి ఉంది. ఈ కేసులో తదుపరి వ్యూహాలను ఖరారు చేసేందుకు లీగల్ టీమ్‌తో కలిసి సమావేశమయ్యారు.

సుప్రీంకోర్టుకు వెళ్లే ప్రతిపాదన
ఈ కేసులో సుప్రీంకోర్టు తలుపు తట్టే అంశంపైనా కేటీఆర్, హరీష్ రావు, కవితలు చర్చించారు. తదుపరి చర్యలపై న్యాయవాదులతో సమాలోచనలు జరిపారు. అరెస్టు నుంచి రక్షణ కల్పించేలా ముందస్తు చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.

Tomorrow is a holiday
రేపు, ఎల్లుండి సెలవు

అనూహ్య సమావేశంపై ఉత్కంఠ
చాలా రోజుల తర్వాత ముగ్గురు బీఆర్ఎస్ నేతలు అత్యవసరంగా సమావేశం కావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆసక్తి రేకెత్తింది. నందినగర్ వద్ద నాయకులను చూసేందుకు అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు గుమిగూడారు. తాజా పరిణామాలు, నేతల నిర్ణయాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *