Breaking News

Abolition of Inter Fustier Examinations

ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రద్దు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం: ఇంటర్మీడియట్ పరీక్షల్లో మార్పులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యారంగంలో మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియట్ (Intermediate) పరీక్షల విధానంలో కీలక మార్పులు చేయనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా (Kritika Shukla) ప్రకటించారు.

ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రద్దు

ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్షలను ఇకపై నిర్వహించబోమని స్పష్టం చేశారు. తాము కేవలం సెకండియర్ పరీక్షలను మాత్రమే నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో విద్యార్థులకు మరింత సులభతరం చేస్తామని తెలిపారు.

విజయవాడ టెర్రర్ లింక్ కేసులో కొత్త మలుపు.. మహిళల రిక్రూట్‌మెంట్‌పై దర్యాప్తు

విద్యార్థుల అభిప్రాయ సేకరణ

ఈ పరీక్షల ఎత్తివేతకు సంబంధించి విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలను సేకరించేందుకు ఈ నెల 26 వరకు సమయం ఇచ్చామని అధికారులు వెల్లడించారు. అందరూ తమ సలహాలు, సూచనలను బోర్డు అధికారులకు అందించాలని కోరారు.

2025-26 నుంచి ఎన్సీఈఆర్టీ సిలబస్

ఇంటర్మీడియట్ బోర్డు మరిన్ని మార్పులకు శ్రీకారం చుడుతోంది. 2025-26 విద్యాసంవత్సరం నుంచి ఫస్టియర్ కోర్సులకు ఎన్సీఈఆర్టీ (NCERT) సిలబస్‌ను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది.

ఉద్దేశం

ఈ మార్పుల ప్రధాన లక్ష్యం విద్యార్థులకు సులభమైన పాఠ్యప్రణాళికను అందించడం, జాతీయ స్థాయిలో పోటీపడేలా వారు సిద్ధం కావాలని ప్రభుత్వం భావిస్తోంది.

కష్టపడిన వారిని గుర్తించాలనేది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం

ఇంటర్ విద్యావిధానంలో తీసుకున్న ఈ నిర్ణయాలు విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *