Breaking News

Debate on Local Body Elections

కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిపై టీపీసీసీ కీలక ప్రకటన

కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిపై టీపీసీసీ కీలక ప్రకటన

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిని రెండు మూడు రోజుల్లో ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం నలుగురు అభ్యర్థుల పేర్లు పరిశీలనలో ఉన్నాయని, అందులో అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ పేరు ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

పాతబస్తీపై బండి సంజయ్ సీరియస్ ప్రశ్నలు

మిత్రపక్షాలకు సంపూర్ణ మద్దతు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో మిత్రపక్షాలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేసిన మహేష్ కుమార్ గౌడ్, కమిటీల్లో కష్టపడి పని చేసే వారికి ఈ నెలాఖరులోగా పాదవులు కట్టబెడతామని చెప్పారు. జనవరి చివరి వారంలో కార్పొరేషన్ పదవులను కూడా భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు.

సీనియర్ నేత డి.వి. సత్యనారాయణ రావు చేరిక
ఈ సందర్భంగా సీనియర్ నేత డి.వి. సత్యనారాయణ రావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్ గాంధీ భవన్లో పార్టీ కండువా కప్పి ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పీసీసీ నేతలు, ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు.

డీజీపీ కాన్వాయ్ ట్రయల్‌లో ఢీ.. ప్రమాదం తప్పింది

తదుపరి ప్రణాళికలు:
కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రణాళికలు సిద్ధం చేస్తూ, కీలక పదవులను భర్తీ చేయడంలో దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *