మహిళా అధికారిణులపై కాంగ్రెస్ మంత్రుల వేధింపులు: కలెక్టర్ పమేలా సత్పతిపై మంత్రి పొంగులేటి వివాదాస్పద వ్యాఖ్యలు
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో మహిళా అధికారిణులకు గౌరవం లేకుండా పోతుందని తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతిపై తీవ్ర అసహనంతో నోటికొచ్చినట్లు మాట్లాడటంతో వివాదం చెలరేగింది.
కరీంనగర్ కలెక్టర్పై అవమానకర వ్యాఖ్యలు
శుక్రవారం ఉదయం కరీంనగర్లో కేంద్ర పట్టణాభివృద్ధి, విద్యుత్, గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ కట్టర్, హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ పర్యటన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి కలెక్టర్ పమేలా సత్పతిపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ, “వాట్ ఆర్ యూ డూయింగ్? వాట్ ఈజ్ దిస్ నాన్సెన్స్? కామన్ సెన్స్ ఉందా?” అంటూ ఆమెపై విమర్శలు గుప్పించారు.
ఆమోదయోగ్యంగా వ్యవహరించని మంత్రి
మహిళా కలెక్టర్ పట్ల కనీస గౌరవం చూపకుండా, ఆమెను కేంద్ర మంత్రుల ముందు అవమానించేలా మాట్లాడటంపై కలెక్టర్ పమేలా సత్పత తీవ్ర అవమానంగా ఫీలై, కార్యక్రమం ముగిసే వరకు ముభావంగా ఉన్నారు.
వివాదాస్పద వీడియో వైరల్
పోనులేటి శ్రీనివాస్ రెడ్డి కలెక్టర్పై చేసిన అవమానకర వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు మంత్రి ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
