Breaking News

"Faith in Modi proved once again" – Pawan Kalyan

18 ఏళ్ళు నిండిన యువతీ, యువకులకు పవన్ కళ్యాణ్ పిలుపు

18 ఏళ్ళు నిండిన యువతీ, యువకులకు పవన్ కళ్యాణ్ పిలుపు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 18 ఏళ్ళు నిండిన యువతీ, యువకులకు కీలకమైన పిలుపునిచ్చారు. జాతీయ ఓటర్ల దినోత్సవం (National Voters Day) సందర్భంగా ట్విట్టర్ వేదికగా ప్రత్యేక పోస్ట్ చేశారు.

“అమరావతిని నాశనం చేయాలనుకున్నారు.. మేము శాసనం చేశాం” – చంద్రబాబు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఓటు అనేది మనకు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడమైతే కాదు, రాజ్యాంగ విలువలను కాపాడటానికి సరైన నాయకులను చట్టసభలకు పంపించాలి” అని పేర్కొన్నారు.

పవన్ కళ్యాణ్, 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతీ, యువకుడు తప్పనిసరిగా ఓటు హక్కు నమోదు చేసుకుని, ఓటింగ్‌లో పాల్గొనాలని కోరారు. “ఈ ఓటు హక్కు మన భవిష్యత్తును తీర్చిదిద్దుకునే శక్తివంతమైన ఆయుధం,” అని ఆయన అన్నారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడిని కలిసిన లోకేష్.. అమరావతిపై కృతజ్ఞతలు

భారతదేశంలో ఓటు హక్కుపై అవగాహన కల్పించి, ఓటర్ల సంఖ్య పెంచేందుకు ప్రతి సంవత్సరం జనవరి 25జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుతున్న విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *