ఫిబ్రవరి మొదటి వారంలో పథకాల అర్హుల వివరాలు వెల్లడించనున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సంక్షేమ పథకాలు (Welfare Schemes) అమలు పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి మొదటి వారంలో అర్హుల వివరాలు (Eligibility Details) ప్రకటించనున్నట్లు ఆయన తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా, ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, పేదవాడి అండగా ఉండాలని నిర్ణయించామని అన్నారు. “గ్రామ సభల్లో వచ్చిన వివరాల ఆధారంగా దరఖాస్తుల ప్రక్రియ కొనసాగించాలనుకుంటున్నాము. అందరికి త్వరగా ఇవ్వాలని అనుకున్నాం కానీ కొంత సమయం పట్టే అవకాశం ఉంది” అని ఆయన చెప్పారు.
గ్రామ సభల్లో కొంతమంది, కొన్ని పార్టీలు కుట్రలు పన్నారని ఆయన అభిప్రాయపడ్డారు. కొత్త అప్లికేషన్లు (Applications) క్రోడీకరించేందుకు సమయం పట్టవచ్చునని మంత్రి పొంగులేటి తెలిపారు. ఫిబ్రవరి మొదటి వారంలో అర్హుల వివరాలు విడుదల చేస్తామని పేర్కొన్నారు.
ఇందిరమ్మ ఇండ్లు (Indiramma Houses) కార్యక్రమంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా, చివరి పేద వారికి కూడా 606 మండలాల్లోని వారికి ఇళ్లకు సంబంధించిన వివరాలు తెలియజేస్తామని మంత్రి తెలిపారు. ” పేద వాడి కోసం పని చేసే ప్రభుత్వం మేం” అని ఆయన అన్నారు.
అనర్హులకు పథకాలు రావడం జరిగినా, వాటిని గుర్తించి వెంటనే రద్దు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. మంచి పథకాలను చెడుగా చిత్రీకరించి ప్రజల మధ్య మరింత అశాంతి సృష్టించకూడదని, ప్రజలకు నిజమైన లబ్ధి చేరేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
