Breaking News

The history of sacrificing lives for the country belongs to the Congress Party: TPCC Chief

దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన చరిత్ర కాంగ్రెస్‌ పార్టీదే: టీపీసీసీ చీఫ్‌

దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన చరిత్ర కాంగ్రెస్‌ పార్టీదే: టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ గౌడ్

హైదరాబాద్‌: భారత రాజ్యాంగాన్ని మార్చేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్ గౌడ్ ఆరోపించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నాంపల్లిలోని గాంధీ భవనంలో ఆదివారం జాతీయ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “మనువాద రాజ్యాంగాన్ని తీసుకురావాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను కేంద్ర హోంమంత్రి అవమానించడమే కాకుండా, ప్రధాని మోడీ ఈ వ్యవహారంలో మౌనం వహిస్తున్నారు,” అని విమర్శించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర

కాంగ్రెస్ పార్టీ త్యాగాలు
టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ గౌడ్ మాట్లాడుతూ, “దేశం కోసం ప్రాణాలను అర్పించిన చరిత్ర కాంగ్రెస్‌ పార్టీదే. మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ జైలు జీవితం గడిపారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ తమ ప్రాణాలను త్యాగం చేసి దేశానికి సేవ చేశారు. కానీ, ప్రధాని మోడీ దేశం కోసం ఏ త్యాగం చేశారని?” అని ప్రశ్నించారు.

బండి సంజయ్‌పై విమర్శలు
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పేరు సంక్షేమ పథకాలకు పెట్టవద్దని బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలు ఆమెను అవమానించేలా ఉన్నాయని మహేశ్‌ గౌడ్‌ ఆరోపించారు. “ఇందిరమ్మ సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు న్యాయం చేసింది. అలాంటి గొప్ప నాయకురాలిపై వ్యాఖ్యలు చేయడం బీజేపీ అసలు రంగు బయటపెట్టింది,” అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేశ రాజ్యాంగాన్ని, గణతంత్రాన్ని రక్షించేందుకు కాంగ్రెస్‌ పార్టీ పోరాటం చేయడం కొనసాగిస్తుందని మహేశ్‌ గౌడ్‌ స్పష్టం చేశారు.

Tomorrow is a holiday
రేపు, ఎల్లుండి సెలవు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *