తెలంగాణలో బండి సంజయ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ విపక్షం తీవ్ర విమర్శలు
తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందించారు. నక్సలైట్ భావజాలం ఉన్న వ్యక్తులు పద్మ అవార్డులకు అనర్హులా? అనే ప్రశ్నలు సంధించారు.
కాంగ్రెస్ నేతల కౌంటర్:
తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, “బండి సంజయ్ వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయి. పథకాలకు ఇందిరమ్మ పేరు పెడితే తప్పేంటి? తెలంగాణ కోసం పోరాడిన గద్దర్ను పద్మ అవార్డులకు ప్రతిపాదిస్తే తప్పా?” అని ప్రశ్నించారు. “మావోయిస్టులుగా ముద్రపడినవారికి ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్లు ఇస్తారు కానీ, అవార్డులు ఇవ్వలేరా?” అంటూ సంజయ్ వ్యాఖ్యలను వ్యంగ్యంగా విమర్శించారు.
అదే సమయంలో, లెఫ్ట్ భావజాలం ఉన్న ఈటల రాజేందర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి ప్రయత్నిస్తుంటే, ఆయనను కూడా అనర్హుడని సంజయ్ అనగలరా? అని ప్రశ్నించారు. “గద్దర్ను గతంలో కేసీఆర్ అవమానిస్తే, ఇప్పుడు బండి సంజయ్ అదే చేస్తున్నారు,” అంటూ ఆది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎంపీ చామల కిరణ్ స్పందన:
కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ మాట్లాడుతూ, “గద్దర్ అనగారిన వర్గాల కోసం పోరాడిన వ్యక్తి. బీజేపీకి అనుకూలంగా ఉన్నవారికే అవార్డులు ఇస్తారా?” అని ప్రశ్నించారు. బండి సంజయ్ గద్దర్పై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బండి సంజయ్ వ్యాఖ్యలపై నిరసన:
బండి సంజయ్ వ్యాఖ్యలకు నిరసనగా గాంధీ భవన్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. “గద్దర్ను అవమానించినందుకు బండి సంజయ్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి,” అని డిమాండ్ చేశారు.
