Breaking News

Key decisions on oil palm processing units

అయిల్ పాం ప్రాసెసింగ్ యూనిట్లపై కీలక నిర్ణయాలు

రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ విఫలం – మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

రుణమాఫీ (Farmers Loan Waiver) విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageshwar Rao) ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో ప్రకటించిన రూ.లక్ష రుణమాఫీ కూడా ఏకకాలంలో చేయకపోవడంతో రైతులకు భారీ వడ్డీ భారం పడిందని పేర్కొన్నారు.

రూ.11,145 కోట్ల వడ్డీ భారం రైతులకు – మంత్రి ఆరోపణలు

✅ బీఆర్ఎస్ పాలనలో రూ.11,145 కోట్ల వడ్డీ భారం రైతులపై పడిందని మంత్రి తుమ్మల విమర్శించారు.
రైతుల సంక్షేమం కోసమే రాష్ట్ర బడ్జెట్‌లో 35 శాతం నిధులను వ్యవసాయానికి కేటాయించామని తెలిపారు.
“రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది” అనే దృక్పథంతో ప్రభుత్వ విధానాలను రూపొందిస్తున్నామని వెల్లడించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర

అయిల్ పాం ప్రాసెసింగ్ యూనిట్లపై కీలక నిర్ణయాలు

బుధవారం సచివాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి, ఆయిల్ పాం సాగు ప్రోత్సహించేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

సిద్దిపేట జిల్లా నర్మెట్ట ఆయిల్ పాం ప్రాసెసింగ్ యూనిట్ జూన్ 1లోగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.
బీచ్పల్లి, కల్లూరు గూడెంలలో ప్రాసెసింగ్ ప్యాక్టరీల నిర్మాణం త్వరగా ప్రారంభించేందుకు టెండర్ల ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు.
నూతన ఆయిల్ పాం సాగు చేపడుతున్న జిల్లాలకు ప్రాసెసింగ్ యూనిట్లు ఉపయుక్తంగా మారతాయని, దీని వల్ల కొత్త రైతులు ముందుకు రావడానికి అవకాశం ఉంటుందన్నారు.

Tomorrow is a holiday
రేపు, ఎల్లుండి సెలవు

ప్రాసెసింగ్ యూనిట్ల నిర్మాణానికి మార్గదర్శకాలు

🔹 ప్రభుత్వం కేటాయించిన భూములను సంస్థ పేరు మీద మార్చుకోవాలని సూచించారు.
🔹 ప్రాసెసింగ్ యూనిట్ల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
🔹 కార్పొరేట్ సంస్థ మాదిరిగా వ్యవస్థీకృతంగా పనిచేసేందుకు నైపుణ్యం కలిగిన సిబ్బందిని నియమించాలని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *