తెలంగాణలో కులగణనపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: తెలంగాణలో కులగణన సర్వే ఫలితాల్లో శాకింగ్ విషయాలు వెల్లడయ్యాయని లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. తెలంగాణ జనాభాలో 90 శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలేనని పేర్కొన్నారు.
బడ్జెట్పై లోక్సభలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు:
📌 కులగణనతోనే అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతాయి.
📌 దేశవ్యాప్తంగా కులగణన ఎందుకు చేయడంలేదని ప్రశ్నించారు.
📌 దేశంలో సగానికి పైగా జనాభా బీసీలే ఉన్నా, వారికి తగిన స్థాయిలో అధికారం లేదని వ్యాఖ్యానించారు.
📌 నూతన అభివృద్ధి నమూనాలు తెచ్చినా, అవి కులగణన ఫలితాల ఆధారంగానే రూపుదిద్దుకోవాలని స్పష్టం చేశారు.
🔹 బీజేపీ పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఎంపీలు ఉన్నా, వారికి అధికారంలో నిజమైన ప్రాధాన్యత లేదని విమర్శించారు. ప్రభుత్వంలో ఉన్నా, వారికిఏ విధంగా హక్కులు లేకుండా చేశారో ఇది అర్థమవుతున్నది అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
కులగణన తప్పనిసరి అని, ప్రజలకు సమాన అవకాశాలు కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని రాహుల్ గాంధీ తెలిపారు. 🚨
