Breaking News

Debate on Local Body Elections

స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ

“స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ – 5 గంటల పాటు సీఎల్పీ సమావేశం

హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన **5.5 గంటల పాటు జరిగిన (CLP) సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహం, ఎస్సీ వర్గీకరణ, కులగణన సర్వే, బడ్జెట్ అంశాలు చర్చించబడ్డాయి. ఈ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలు పాల్గొన్నారు.

“విపక్షాల దుష్ప్రచారంపై సమన్వయం” – పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్

సీఎల్పీ సమావేశం ముగిసిన అనంతరం పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ, “స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహం, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై చర్చించాం” అని తెలిపారు.

“ప్రజలను తప్పుదోవ పట్టించే విపక్షాలపై పోరాటం”

“కులగణనపై విపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి. ఈ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికి నాం మార్గనిర్దేశం ఇచ్చాం” అని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర

“పార్టీ నిర్మాణం, పథకాలు అమలు, రాష్ట్ర ఆదాయం, అప్పులపై చర్చ”

“పీసీసీ కార్యవర్గం రూపకల్పన, పార్టీ నిర్మాణం, పథకాలు అమలు, రాష్ట్ర ఆదాయం, అప్పుల, వ్యయంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చర్చించామని చెప్పారు.

“బహిరంగ సభలకు అధిష్ఠానం నేతలను ఆహ్వానించేందుకు ఢిల్లీ పర్యటన”

“ఫిబ్రవరిలో రెండు భారీ బహిరంగ సభలు నిర్వహిస్తాం. అధిష్ఠానం నేతలను ఆహ్వానించేందుకే ఢిల్లీ వెళ్ళిపోతున్నాం” అని పీసీసీ అధ్యక్షుడు పేర్కొన్నారు.

“ఎమ్మెల్యేలు డిన్నర్ సమావేశాలు నిర్వహించడం తప్పేమీ కాదు”

“ఎమ్మెల్యేలు డిన్నర్ సమావేశాలు నిర్వహించడం తప్పేమీ కాదు. అది పార్టీలో సభ్యత్వం, వర్గాల అభిప్రాయాల పరస్పర చర్చకు సంబంధించినది” అని ఆయన స్పష్టం చేశారు.

Tomorrow is a holiday
రేపు, ఎల్లుండి సెలవు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *