ఫిబ్రవరి 24 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
అమరావతి: ఈ నెల 24 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. తొలి రోజు గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
ఫిబ్రవరి 28న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం
- 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ఫిబ్రవరి 28న ప్రవేశపెట్టే అవకాశముందని సమాచారం.
- అసెంబ్లీ సమావేశాలను 15 పనిదినాల పాటు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
- మొదటి రోజు బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశం అనంతరం అసెంబ్లీ వ్యవధిపై నిర్ణయం తీసుకోనున్నారు.
మంత్రులకు పూర్తి స్థాయి సబ్జెక్టుతో హాజరు కావాలని ఆదేశాలు
- అసెంబ్లీ సమావేశాలకు మంత్రులు తమ శాఖలకు సంబంధించిన పూర్తి స్థాయి సబ్జెక్టులతో హాజరుకావాలని ప్రభుత్వం సూచనలు జారీ చేసింది.
