Breaking News

A three-piece battle is going on between KTR, Kavitha and Harish Rao

కేటీఆర్, కవిత, హరీష్ రావుల మధ్య మూడు ముక్కలాట నడుస్తోంది

కేటీఆర్ మేకపోతు గాంభీర్యం – బీఆర్ఎస్ మూడు ముక్కలాట: టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

📍 గజ్వేల్: బీఆర్ఎస్ నాయకత్వం అంతర్గత విభేదాలతో చీలిపోయిందని, కేటీఆర్, కవిత, హరీష్ రావుల మధ్య మూడు ముక్కలాట నడుస్తోందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. సోమవారం గజ్వేల్ రిమ్మన్నగూడ ఎస్-4 వద్ద మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

🔹 కేటీఆర్ పై మహేశ్ కుమార్ గౌడ్ విమర్శలు:

బీసీల గురించి బీఆర్ఎస్ నేతలు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది.
కుల గణన సర్వేలో పాల్గొనని కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యులకు రీ సర్వే జరపమని అడిగే అర్హత లేదు.
తెలంగాణలో బీఆర్ఎస్ దుకాణం బంద్ అయింది.
ఫామ్ హౌస్‌కే పరిమితమైన కేసీఆర్‌కు ప్రతిపక్ష హోదా ఎందుకు?
గజ్వేల్ ప్రజలను పట్టించుకోకుండా ఫామ్ హౌస్‌లో సేద తీరుతున్న కేసీఆర్‌పై ప్రజలు సిగ్గుపడాలి.

గవర్నర్‌ను కలిసిన బీఆర్ఎస్ నేతలు.. పొంగులేటిపై మైనింగ్ ఆరోపణల ఫిర్యాదు

🔹 బీఆర్ఎస్-బీజేపీ పొత్తుపై తీవ్ర ఆరోపణలు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్-బీజేపీ లొపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నాయి.
పార్లమెంట్ ఎన్నికల్లో మాదిరిగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీజేపీకి బీఆర్ఎస్ మద్దతిస్తోంది.
బీజేపీకి 8 మంది ఎంపీలు ఉన్నా, రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్‌లో గాడిద గుడ్డు మాత్రమే వచ్చింది.
బీజేపీ నేతలు మతం పేరిట రెచ్చగొట్టి లబ్ధి పొందడం వారి ఆనవాయితీ.

🔹 కుల గణన సర్వేపై మహేశ్ గౌడ్ సమర్థన

📢 స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో మొట్టమొదటిగా తెలంగాణలో కుల గణన సర్వే జరిగింది.
📢 ఈ సర్వేతో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచింది.
📢 పారదర్శకంగా, ఖచ్చితంగా కుల గణన నిర్వహించాం.

కల్తీ ఆహారంపై యుద్ధం.. ప్రత్యేక వ్యవస్థతో కఠిన చర్యలు: సీఎం రేవంత్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *