కేటీఆర్ మేకపోతు గాంభీర్యం – బీఆర్ఎస్ మూడు ముక్కలాట: టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
📍 గజ్వేల్: బీఆర్ఎస్ నాయకత్వం అంతర్గత విభేదాలతో చీలిపోయిందని, కేటీఆర్, కవిత, హరీష్ రావుల మధ్య మూడు ముక్కలాట నడుస్తోందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. సోమవారం గజ్వేల్ రిమ్మన్నగూడ ఎస్-4 వద్ద మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
🔹 కేటీఆర్ పై మహేశ్ కుమార్ గౌడ్ విమర్శలు:
✅ బీసీల గురించి బీఆర్ఎస్ నేతలు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది.
✅ కుల గణన సర్వేలో పాల్గొనని కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యులకు రీ సర్వే జరపమని అడిగే అర్హత లేదు.
✅ తెలంగాణలో బీఆర్ఎస్ దుకాణం బంద్ అయింది.
✅ ఫామ్ హౌస్కే పరిమితమైన కేసీఆర్కు ప్రతిపక్ష హోదా ఎందుకు?
✅ గజ్వేల్ ప్రజలను పట్టించుకోకుండా ఫామ్ హౌస్లో సేద తీరుతున్న కేసీఆర్పై ప్రజలు సిగ్గుపడాలి.
🔹 బీఆర్ఎస్-బీజేపీ పొత్తుపై తీవ్ర ఆరోపణలు
⚡ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్-బీజేపీ లొపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నాయి.
⚡ పార్లమెంట్ ఎన్నికల్లో మాదిరిగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీజేపీకి బీఆర్ఎస్ మద్దతిస్తోంది.
⚡ బీజేపీకి 8 మంది ఎంపీలు ఉన్నా, రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్లో గాడిద గుడ్డు మాత్రమే వచ్చింది.
⚡ బీజేపీ నేతలు మతం పేరిట రెచ్చగొట్టి లబ్ధి పొందడం వారి ఆనవాయితీ.
🔹 కుల గణన సర్వేపై మహేశ్ గౌడ్ సమర్థన
📢 స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో మొట్టమొదటిగా తెలంగాణలో కుల గణన సర్వే జరిగింది.
📢 ఈ సర్వేతో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచింది.
📢 పారదర్శకంగా, ఖచ్చితంగా కుల గణన నిర్వహించాం.
