Breaking News

Chandrasekhar Reddy objected to road widening

రహదారి విస్తరణలో చంద్రశేఖర్ రెడ్డి అభ్యంతరం

బీఆర్ పార్క్ రహదారి విస్తరణపై అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి ఫిర్యాదు

📍 హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ వద్ద రహదారి విస్తరణ పనులకు ప్రభుత్వం ప్రారంభం చేసింది. ఈ ప్రాజెక్టు కోసం రూ.1,100 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖ హీరో అల్లు అర్జున్ మామ, కాంగ్రెస్ నేత చంద్రశేఖర్ రెడ్డి తన ఇంటి స్థలాన్ని ప్రభుత్వం సేకరించనున్న నేపథ్యంలో పునరాలోచన చేయాలని ప్రభుత్వ అధికారులను కోరారు. సోమవారం గ్రీన్ లాండ్స్‌లోని మహాత్మ జ్యోతిరావు పూలే భవనంలో ప్రజావాణి కార్యక్రమంలో ఆయన ఫిర్యాదు చేశారు.

గవర్నర్‌ను కలిసిన బీఆర్ఎస్ నేతలు.. పొంగులేటిపై మైనింగ్ ఆరోపణల ఫిర్యాదు

🔹 రహదారి విస్తరణలో చంద్రశేఖర్ రెడ్డి అభ్యంతరం

✅ చంద్రశేఖర్ రెడ్డి తన ఫిర్యాదులో తన ప్లాట్‌లో ఒక వైపు 20 అడుగులు, మరో వైపు 36 అడుగుల భూమి తీసుకుంటున్నట్లు సమాచారం ఉందని, దీనిపై అధికారుల నుంచి పూర్తి వివరణ కోరారు.
✅ కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు జంక్షన్ అభివృద్ధి ప్రాజెక్ట్ చేపట్టినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

కల్తీ ఆహారంపై యుద్ధం.. ప్రత్యేక వ్యవస్థతో కఠిన చర్యలు: సీఎం రేవంత్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *