|| TPCC chief Mahesh Kumar Goud challenged KTR ||
📍 హైదరాబాద్: బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) కు టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) సవాల్ విసిరారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన, “పదేళ్ల బీఆర్ఎస్ పాలన Vs ఏడాది కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమా?” అంటూ కేటీఆర్ను ప్రశ్నించారు.
🔹 “కేటీఆర్ ప్రగల్భాలు పలకడం ఆపి, దమ్ముంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలోకి దిగాలి” అని మహేశ్ కుమార్ గౌడ్ సూచించారు. “చెల్లి (కవిత), బావ (హరీష్ రావు) ఇచ్చిన షాక్తో కేటీఆర్ మతిభ్రమించి మాట్లాడుతున్నాడు” అంటూ విమర్శలు గుప్పించారు.
బీజేపీ – బీఆర్ఎస్ లోపాయికారీ ఒప్పందం?
🔸 బీజేపీ (BJP)తో బీఆర్ఎస్ (BRS) కలిసిపోయిందని ఆరోపించిన మహేశ్ గౌడ్, “ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ – బీఆర్ఎస్ లాలూచీపై కూడా చర్చకు సిద్ధం” అని ప్రకటించారు.
🔹 “బీసీ కులగణన (Caste Census), ఎస్సీ వర్గీకరణ (SC Classification)పై చర్చకు సిద్ధంగా ఉన్నాం. దమ్ముంటే కేటీఆర్ రమణయ్యా వచ్చి చర్చించాలి” అని ఘాటుగా అన్నారు.
పార్లమెంటు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి ఖాయం
🔸 “కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాల్లో ప్రజలు పార్లమెంటు ఎన్నికల్లో సున్నా ఇచ్చినా మీకు బుద్ధి రాలేదా?” అని మహేశ్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు.
🔹 “ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్కు గాడిద గుడ్డే వస్తుంది” అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
🔸 “ఇప్పటివరకు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించలేకపోవడం చూస్తే, మీ దమ్ము ఏంటో అందరికీ అర్థమైంది” అని ఎద్దేవా చేశారు.
“బీఆర్ఎస్ మూడు ముక్కలుగా చీలిపోయింది”
🔹 మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, “పదేళ్ల బీఆర్ఎస్ విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల బృందం పునర్వికాసం వైపు నడిపిస్తున్నారు” అని తెలిపారు.
🔸 “బీఆర్ఎస్ మూడు ముక్కలుగా చీలిపోయింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో కనిపించదు” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
📌 “బీఆర్ఎస్కు తెలంగాణ ప్రజలు గుణపాఠం చెప్పబోతున్నారు” అంటూ మహేశ్ గౌడ్ హెచ్చరించారు. 🚨
