Breaking News

Former CM Jagan's mental state is not good? – Minister Achchennaidu

మంత్రి అచ్చెన్నాయుడు అత్యవసర సమీక్ష

ఏపీ లో బర్డ్ ఫ్లూ కలకలం: తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో హెచ్చరిక

📍 అమరావతి: తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో కోళ్ల మరణాలకు ఏవియన్ ఇన్ఫ్లూయెంజా (H5N1 – బర్డ్ ఫ్లూ) వైరస్ కారణమని అధికారులు ధృవీకరించారు.

🔹 భోపాల్ ల్యాబ్ పరీక్షల్లో బర్డ్ ఫ్లూ నిర్ధారణ
📌 పశు సంవర్ధక శాఖ అధికారులు మధ్యప్రదేశ్‌లోని భోపాల్ (ICAR-NIHSID) ల్యాబ్‌కు నమూనాలను పంపించారు.
📌 పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు మండలం వేల్పూరు, తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు ఫారాల నుంచి పంపిన రెండు నమూనాల్లో పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.

పేదల కోసం భారీ హౌసింగ్ డ్రైవ్.. 2029 నాటికి ఇల్లు లేని వారే లేరు: చంద్రబాబు

🔹 రెడ్ అలర్ట్ ప్రకటించిన అధికారులు
📌 పాజిటివ్ కేసులు ఉన్న ఫారాల్లోని అన్ని కోళ్లను నిర్వీర్యం చేసి, 2 కి.మీ పరిధిలో రెడ్ అలర్ట్ ప్రకటించారు.
📌 బర్డ్ ఫ్లూ ప్రభావిత ప్రాంతాల్లో కోళ్ల రవాణాపై సంపూర్ణ నిషేధం విధించారు.

🔹 మంత్రి అచ్చెన్నాయుడు అత్యవసర సమీక్ష
📌 ఏపీ వ్యవసాయ, పశు సంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు (Minister Achchennaidu) జిల్లా అధికారులతో అత్యవసర భేటీ నిర్వహించారు.
📌 ప్రభావిత ప్రాంతాల్లో వెటర్నరీ వైద్యులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
📌 జిల్లాల వారీగా వైరస్ ఉధృతిని జోన్లుగా విభజించి సమీక్షించాలని అధికారులను ఆదేశించారు.
📌 ప్రతి పౌల్ట్రీ వద్ద బయో సెక్యూరిటీ చర్యలు పటిష్ఠంగా అమలు చేయాలని స్పష్టం చేశారు.

నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుపుతున్న తెల్ల పలుగు రాయి క్వారీ దృశ్యం

🚨 ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బర్డ్ ఫ్లూ లక్షణాలు గమనిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని పశు సంవర్ధక శాఖ సూచించింది. 🐔❌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *