Breaking News

డిజిటల్ దశలో ముందుకు తెలుగు రాష్ట్రం – సీఎం చంద్రబాబు

“డబ్బు కాదు.. డేటా ముఖ్యం!” – సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

📍 గుంటూరు: “మన దగ్గర ఎంత డబ్బు ఉందో కాదు.. ఎంత డేటా ఉందో అదే ముఖ్యమైనది” అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు మంగళదాస్ నగర్‌లోని ప్రైవేట్ వైద్యశాల ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, వైద్యులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

🔹 సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, “ప్రతి కుటుంబంలో కనీసం ఒకరు ఐటీ చదవాలని 1995లోనే చెప్పాను. అందుకు ఫలితంగా నేడు మన రాష్ట్రం ఐటీ రంగంలో ముందున్నది” అని అన్నారు.
🔹 1995లో ఐటీ గురించి మాట్లాడానని, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) గురించి చెబుతున్నా” అని చంద్రబాబు పేర్కొన్నారు.
🔹 భవిష్యత్తులో ప్రపంచాన్ని ఏఐ (AI) శాసించబోతోంది అని ఆయన అభిప్రాయపడ్డారు.
🔹 రాష్ట్రంలో ఇప్పటికే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వ సేవలు ప్రజలకు అందుతున్నాయని, త్వరలో ప్రైవేట్ సేవలను కూడా ఈ విధానంతో అనుసంధానం చేస్తామని సీఎం తెలిపారు.

Tomorrow is a holiday
రేపు, ఎల్లుండి సెలవు

✅ సీఎం చంద్రబాబు వైద్య రంగ అభివృద్ధి, ఆరోగ్య సేవలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
“గతంలో గుండె ఆపరేషన్‌ కోసం ఎన్టీఆర్ అమెరికాకు వెళ్లారు. నా అత్తగారు క్యాన్సర్‌తో మృతి చెందారు. ఆ బాధను అర్థం చేసుకుని క్యాన్సర్ బాధితులకు మెరుగైన చికిత్స అందించేందుకు ఎన్టీఆర్ బసవతారకం ఆసుపత్రిని నెలకొల్పారు” అని గుర్తుచేశారు.
✅ గుంటూరులో ఏర్పాటు చేసిన కిమ్స్ శిఖర ఆసుపత్రి వైద్య సేవలను అభినందిస్తూ, ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలను అందించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని చెప్పారు.

Reconstruction of the state is our goal: CM Chandrababu
రాష్ట్ర పునర్నిర్మాణం మా లక్ష్యం: సీఎం చంద్రబాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *