Breaking News

Etala Rajender's "Priority for BC under BJP leadership"

“బీజేపీ సారథ్యంలోనే బీసీలకు ప్రాధాన్యత”

“కుల గణన రాష్ట్రాల పరిధిలో జరగాల్సిన ప్రక్రియ” – బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్

బీజేపీ ఎంపీ, మాజీ మంత్రి ఈటల రాజేందర్ (Eatala Rajendar) కుల గణన (Caste Census) పై కీలక వ్యాఖ్యలు చేశారు. “కుల గణన రాష్ట్రాల పరిధిలో జరగాల్సిన ప్రక్రియ” అని పేర్కొంటూ, ప్రతి రాష్ట్రంలో ఒక్కో కులానికి ఒక్కో రిజర్వేషన్ విధానం ఉంది” అని తెలిపారు.

2027 నాటికి హైకోర్టు కొత్త భవనాలు పూర్తి.. సీఎం ఎ. రేవంత్ రెడ్డి

“కుల గణనకు నిజమైన చిత్తశుద్ధి ఉందా?”

  • “కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే కమిషన్ వేసి శాస్త్రీయంగా కుల గణన చేయాలి” అని డిమాండ్ చేశారు.
  • “తమిళనాడు చట్టబద్ధ కమిటీ వేసి కుల గణన చేపట్టింది, బీహార్ కూడా అలాగే చేసింది” అని గుర్తుచేశారు.
  • “కుల గణన కాదనలేని సత్యం.. ఏ కులాన్ని విస్మరించలేం” అని స్పష్టం చేశారు.

“బీసీ జనాభా తగ్గుతోందా?” – ఈటల ప్రశ్న

  • “జనాభా పెరుగుతున్నది అంగీకరించేది అయితే, బీసీ జనాభా తగ్గుతుందా?” అని ప్రశ్నించారు.
  • “2011లో రాష్ట్ర జనాభా 3.61 కోట్లు.. ఇప్పుడు 4 కోట్లకు పైగా ఉందని అంచనా”.
  • “అలాంటప్పుడు బీసీ జనాభా 46%గా ఎలా ఉంటుందని” మండిపడ్డారు.
  • “ఇంతకంటే దుర్మార్గపు లెక్కల మోసం ఏముంటుంది?” అని విరుచుకుపడ్డారు.

“సీఎం రేవంత్ రెడ్డికి నిజాయితీ లేదు”

  • “సీఎం రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్లపై బ్లఫ్ చేసి, మోసం చేసి లెక్కలు ప్రకటించారు” అని విమర్శించారు.
  • “ప్రభుత్వం డ్రామా కంపెనీ కాదు.. రిజర్వేషన్లు, కుల గణనపై మాట ఇస్తే తప్పక పాటించాలి” అని హితవు పలికారు.

“ప్రధాని మోదీ మాట నిలబెట్టుకుంటారు”

  • “ప్రధాని మోదీ మాట ఇస్తే అమలు చేస్తారన్న విశ్వాసం ప్రజల్లో ఉంది” అని ఈటల పేర్కొన్నారు.
  • “రాహుల్ గాంధీ పార్లమెంటులో తెలంగాణ అణగారిన వర్గాల గురించి మాట్లాడతారు. కానీ 1956 నుంచి 45 ఏళ్లపాటు పాలించిన కాంగ్రెస్ ఒక్క బీసీని సీఎంగా ఎందుకు చేయలేదు?” అని నిలదీశారు.

“బీజేపీ సారథ్యంలోనే బీసీలకు ప్రాధాన్యత”

  • “ప్రాంతీయ పార్టీలకు సామాజిక న్యాయం గురించి మాట్లాడే హక్కు లేదు. కానీ జాతీయ పార్టీలు ఎందుకు చేయలేకపోయాయి?” అని ప్రశ్నించారు.
  • “ప్రధాని మోదీ నాయకత్వంలో బీసీలకు తగిన ప్రాధాన్యత లభిస్తోంది. తెలంగాణలోనూ బీసీ సీఎం ప్రకటన చేశాం” అని ఈటల రాజేందర్ గుర్తు చేశారు.

ఈటల రాజేందర్ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. కుల గణన, బీసీ రిజర్వేషన్ల అంశంపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం మరింత వేడెక్కే అవకాశం ఉంది.

జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు.. సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఘన నివాళి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *