Breaking News

A lawyer has a heart attack in the middle of arguing a case

కేసు వాదన మధ్య న్యాయవాదికి గుండెపోటు

హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో విచారణ సందర్భంగా సీనియర్ న్యాయవాది పసునూరి వేణుగోపాల్ (Pasunoori Venugopal) గుండెపోటుతో మృతి చెందారు. కోర్టు గదిలో తన క్లయింట్ తరపున వాదనలు వినిపిస్తుండగా ఆయన అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు.

ఫిబ్రవరి 18న ఓ కేసుకు సంబంధించి పసునూరి వేణుగోపాల్ కోర్టులో వాదనలు వినిపిస్తున్న సమయంలో హఠాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కోర్టు సిబ్బంది, తోటి న్యాయవాదులు అప్రమత్తమై ఆస్పత్రికి తరలించినప్పటికీ, వైద్యులు ఆయనను పరీక్షించి అప్పటికే మరణించారని నిర్ధారించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర

వేణుగోపాల్ అకాల మరణం న్యాయవాద వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. కోర్టు ప్రాంగణంలోనే తన చివరి శ్వాస విడవడం, న్యాయవాదుల మధ్య విషాదం నింపింది. తోటి న్యాయవాదులు ఆయన మృతిపై సంతాపం ప్రకటించారు.

ఇటీవల యువత నుంచి వృద్ధుల వరకు గుండెపోటు కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కొందరు ఎమర్జెన్సీ చికిత్స ద్వారా ప్రాణాలను దక్కించుకుంటుండగా, మరికొందరు తుది శ్వాస విడుస్తున్నారు. విద్య, ఉద్యోగ, న్యాయ రంగాల్లో పని ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, జీవన శైలి మార్పులు గుండె సంబంధిత సమస్యలకు ప్రధాన కారణాలుగా చెబుతున్నారు వైద్య నిపుణులు.

Tomorrow is a holiday
రేపు, ఎల్లుండి సెలవు

న్యాయ రంగానికి ఆయన అందించిన సేవలు మరవలేనివని, న్యాయవాద వృత్తిలో ఆయన అభిప్రాయాలు, న్యాయ వ్యవస్థకు ఆయన చేసిన కృషిని గౌరవిస్తూ, హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *