ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళా (Mahakumbh) కొనసాగుతూనే ఉంది. ప్రతి రోజూ లక్షలాది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ మహాకుంభమేళాలో ఇప్పటివరకు 56 కోట్లు పైగా భక్తులు పాల్గొన్నారు.
ఈ మేళాలో ప్రముఖులు కూడా పెద్ద సంఖ్యలో హాజరై తమ పుణ్య స్నానాలను ఆచరిస్తున్నారు. తాజాగా, భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) తన కుటుంబంతో కలిసి మహాకుంభమేళాకు హాజరయ్యారు. ఆయన, తన భార్య మరియు పిల్లలతో కలిసి త్రివేణి సంగమం లో పుణ్యస్నానాలు ఆచరించారు.
అలాగే, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి (Prahlad Joshi) కూడా తన కుటుంబంతో కలిసి మహాకుంభమేళాకు విచ్చేసి పవిత్ర స్నానం చేసారు. ప్రముఖ గాయకుడు షాన్ కూడా తన కుటుంబంతో ఈ ఘట్టంలో పాల్గొని పుణ్య స్నానాలు ఆచరించారు.
