|| Former CM Jagan’s mental state is not good? – Minister Achchennaidu
మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) మాటలు వింటుంటే ఆయన మానసిక స్థితి బాగా లేదని అనిపిస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు (Minister Atchannaidu) విమర్శించారు. సచివాలయంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జగన్ 150 సీట్లతో అధికారంలోకి వచ్చి ఐదేళ్లు ప్యాలెస్లకే పరిమితమయ్యారని మండిపడ్డారు.
“నిజమైన నాయకుడు ప్రజల కోసం పనిచేయాలి”
👉 “ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండొద్దని ప్రజలు ఆయనను ఓడించారు. అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా, నిరంతరం ప్రజల కోసం పనిచేసే వాడే నిజమైన నాయకుడు”, అని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.
👉 గత వైసీపీ పాలనలో రాష్ట్రంలో 70% మందికి జీవనాధారం అయిన వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు.
👉 “ఒక్క సెంటు భూమికి అయినా సాయిల్ టెస్ట్ చేశారా?”, అని జగన్ను నిలదీశారు.
👉 రాయలసీమ జిల్లాలో డ్రిప్ ఇరిగేషన్ పైనే ఎక్కువ మంది రైతులు ఆధారపడుతున్నారని, కానీ జగన్ ప్రభుత్వం రైతుల కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు.
“ఇప్పుడున్న ప్రభుత్వం తక్షణమే రైతులకు మద్దతు”
✔️ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసిన రెండు గంటల్లోనే వారి ఖాతాల్లో డబ్బులు జమ చేశామని మంత్రి వెల్లడించారు.
✔️ గుంటూరు మిర్చి యార్డులో (Guntur Mirchi Yard) రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుందని, మద్దతు ధర లేకపోతే ప్రభుత్వం తగిన విధంగా నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.
✔️ గత వైసీపీ పాలనలో రూ. 7,000 మద్దతు ధర ప్రకటించారని, అయితే మార్కెట్లో అప్పటికే రూ. 12,000 ఉండేదని గుర్తు చేశారు.
✔️ ఇప్పుడు జగన్ మిర్చి యార్డుకు వెళ్లి విమర్శలు చేయడం తగదని అచ్చెన్నాయుడు ఆక్షేపించారు.
“పని లేకుండా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే జగన్ కంటే, రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేసే ప్రభుత్వం కావాలి”, అని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.
