Breaking News

Congress is writing down the rights of Hindus in Telangana? – Bandi Sanjay

తెలంగాణలో హిందువుల హక్కులను కాంగ్రెస్ కాలరాస్తోంది – బండి సంజయ్

|| Congress is writing down the rights of Hindus in Telangana? – Bandi Sanjay ||

తెలంగాణలో హిందువులది బిచ్చపు బతుకైందా? అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మంచిర్యాల నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం హిందువులపై వివక్ష చూపుతోందని ఆరోపించారు.

ముస్లిం ఉద్యోగులకు సౌలత్యం – హిందువులకు మాత్రం ఆంక్షలు?

🔥 “కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం ఉద్యోగులకు రంజాన్ సమయంలో సాయంత్రం 4 గంటలకే ఇంటికి వెళ్లే వెసులుబాటు కల్పిస్తోంది. అదే అయ్యప్ప మాల, శివ మాల, భవానీ మాల ధరించిన హిందూ ఉద్యోగులకు అలాంటి అవకాశం ఎందుకు ఇవ్వడం లేదు?” అని బండి సంజయ్ ప్రశ్నించారు.
🔥 “అయ్యప్ప దీక్షాధారులు సొంతంగా వంట చేసుకుని తినాల్సి వస్తోంది. కానీ పని ఒత్తిడిలో వాళ్లు బయటకు వెళితే పై అధికారుల చర్యలకు గురవుతారేమోనన్న భయంతో పస్తులుంటున్నారు. వీరికి కూడా ముస్లింలకు ఇచ్చినట్లుగా వెసులుబాటు ఎందుకు ఇవ్వరు?” అని నిలదీశారు.
🔥 “చట్టం అందరికీ సమానమే అయినా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక వర్గం అంటే పక్షపాతం, మరొక వర్గం అంటే కక్ష ఎందుకు?” అని ప్రశ్నించారు.

తబ్లిగ్ జమాత్‌కు 2.5 కోట్లు – హిందువుల పండుగలకు ఎందుకివ్వరు?

“ఇస్లాం ఉగ్రవాద ప్రేరేపిత సంస్థ తబ్లిగ్ జమాత్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం వికారాబాద్‌లో సమావేశం పెట్టుకోవడానికి రూ.2.5 కోట్లు ఇచ్చింది. కానీ హిందువుల పండుగలకు మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు” అని సంజయ్ మండిపడ్డారు.
“ప్రశ్నిస్తే మమ్మల్ని మతతత్వవాదులంటారు. కానీ మైనార్టీ ఓట్ల కోసమే కాంగ్రెస్ అశ్రద్దత్మక వైఖరి తీసుకెళ్తోంది” అని ఆరోపించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర

కాంగ్రెస్ సూడో-సెక్యులరిజంతో హిందువులను అవమానిస్తోంది

📢 “కాంగ్రెస్ పార్టీ నిజమైన సెక్యులరిజాన్ని పాటిస్తోందా? లేక ముస్లింల ఓటు కోసం హిందువులను పక్కన పడేస్తోందా?” అని బండి సంజయ్ ప్రశ్నించారు.
📢 “ఒకవైపు ముస్లింలను బుజ్జగించడం, మరోవైపు హిందువుల హక్కులను కాలరాయడం కాంగ్రెస్ సుదీర్ఘ వ్యూహం. మతాల మధ్య చిచ్చు పెట్టి ఓట్ల కోసమే ఆడే రాజకీయాలు తగవు” అని ఆయన స్పష్టం చేశారు.
📢 “ఇప్పటికే ఓటు బ్యాంకు రాజకీయాలతో దేశాన్ని చీల్చిన కాంగ్రెస్ ఇప్పుడు కులాల రాజకీయాలకు తెరలేపింది” అని ఆయన విమర్శించారు.

కాంగ్రెస్‌కు గట్టి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది

👉 “తెలంగాణలో హిందువులను రెండో శ్రేణి పౌరులుగా మార్చే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు గమనిస్తున్నారు. త్వరలోనే గట్టి బుద్ధి చెబుతారు” అని బండి సంజయ్ హెచ్చరించారు.
👉 “బీజేపీ ప్రభుత్వం వస్తేనే నిజమైన సమానత్వం, న్యాయం జరుగుతుంది” అని ఆయన అన్నారు.

తెలంగాణలో మతసామరస్యాన్ని దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని బండి సంజయ్ ఆరోపిస్తూ, రానున్న ఎన్నికల్లో ప్రజలు దీని గురించి ఆలోచించి తగిన తీర్పు ఇవ్వాలని పిలుపునిచ్చారు.

Tomorrow is a holiday
రేపు, ఎల్లుండి సెలవు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *