Breaking News

AI రంగంలో అదానీ రాయల్ ఎంట్రీ.. విశాఖ తర్వాత హైదరాబాదే నెక్ట్స్ స్టాప్?

నేటి తెలుగు పత్రిక: కార్పొరేట్ దిగ్గజం Gautam Adani నేతృత్వంలోని Adani Group భారీ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌తో దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపింది. పునరుత్పాదక ఇంధనంతో నడిచే హైపర్‌స్కేల్ AI డేటా సెంటర్ల కోసం దాదాపు 100 బిలియన్ డాలర్లు (సుమారు రూ.9 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది.


విశాఖలో ఇప్పటికే భారీ ప్రాజెక్ట్

Google భాగస్వామ్యంతో Visakhapatnamలో గిగావాట్ సామర్థ్యంతో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు పనులు ప్రారంభమయ్యాయి. ఈ ప్రాజెక్ట్‌కు భూమిపూజ కూడా జరిగింది. టెక్నాలజీ–ఎనర్జీ కలయికలో ఇది కీలక అడుగు గా భావిస్తున్నారు.ఈ ప్రాజెక్ట్‌కు అప్పటి ఆంధ్రప్రదేశ్ నాయకత్వం మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే.


ఇప్పుడు హైదరాబాదు ఫోకస్

ఇప్పుడు సమీకరణంలో కొత్త కాంబినేషన్ చర్చకు వచ్చింది.
Microsoftతో కలిసి Hyderabadలో AI డేటా సెంటర్ మౌలిక సదుపాయాలపై ఫోకస్ పెట్టినట్లు సమాచారం.

ఈ పరిణామాల నేపథ్యంలో Revanth Reddy వెంటనే సమీక్ష నిర్వహించి:

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
  • డేటా సెంటర్లకు భూముల లభ్యత
  • భూసేకరణ విధానం
  • ఇతర రాష్ట్రాల పాలసీలపై అధ్యయనం
  • కంపెనీలకు రాయితీలు

వంటి అంశాలపై అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.


భారీ లక్ష్యాలు

ప్రస్తుతం అదానీ గ్రూప్‌కు సుమారు 2 గిగావాట్ల డేటా సెంటర్ సామర్థ్యం ఉంది. దీన్ని 5 గిగావాట్లకు విస్తరించాలన్నది లక్ష్యం. ఎనర్జీ, AI, డేటా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో గ్లోబల్ స్థాయిలో ముందంజలో నిలవాలన్నదే దీర్ఘకాల వ్యూహంగా కనిపిస్తోంది.పెట్టుబడి ప్రకటన వెలువడగానే అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు కూడా గణనీయంగా లాభపడ్డాయి.


హైదరాబాద్‌కు బిగ్ బూస్ట్?

విశాఖ తర్వాత హైదరాబాద్‌లో మెగా AI డేటా సెంటర్ వస్తే:

  • వేలాది ఉద్యోగాలు
  • భారీ పెట్టుబడులు
  • టెక్ ఎకోసిస్టమ్ బలోపేతం
  • గ్రీన్ ఎనర్జీ వినియోగం

వంటి ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

మొత్తానికి, అదానీ–మైక్రోసాఫ్ట్–తెలంగాణ ప్రభుత్వ కాంబినేషన్ నిజంగానే సాకారం అయితే, హైదరాబాద్ AI హబ్‌గా మరింత వేగంగా ఎదగడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *