Breaking News

ఢిల్లీలో ప్రముఖ ప్రదేశాలపై ఉగ్ర కుట్ర అనుమానం.. భద్రత కట్టుదిట్టం

నేటి తెలుగు పత్రిక: దేశ రాజధాని **న్యూఢిల్లీ** లోని కీలక ప్రాంతాలపై ఉగ్రదాడి కుట్ర పన్నుతున్నట్లు భద్రతా వర్గాలు సమాచారం అందించాయి. ముఖ్యంగా ఎర్రకోట, చాందిని చౌక్ పరిసర ప్రాంతాల్లో పేలుళ్లకు కుట్ర జరుగుతోందని ప్రాథమిక సమాచారం.

పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కర్-ఎ-తోయిబా ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (IED)లతో దాడులు చేయాలనే యోచనలో ఉందని భద్రతా సంస్థలను ఉటంకిస్తూ వర్గాలు వెల్లడించాయి.

మన నగరం పరిశుభ్రత మనందరి బాధ్యత…!

భద్రతా చర్యలు కట్టుదిట్టం

  • చారిత్రక కట్టడాలు, మతపరమైన ప్రదేశాల వద్ద అదనపు బందోబస్తు
  • సీసీటీవీ నిఘా పెంపు
  • అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేక నిఘా
  • ఇంటెలిజెన్స్ యంత్రాంగం అలర్ట్

అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడకపోయినా, అప్రమత్తంగా ఉండాలని పోలీసు వర్గాలు సూచిస్తున్నాయి. ప్రజలు అపోహలు, వదంతులను నమ్మకుండా అధికారుల సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

దేశవ్యాప్తంగా ప్రముఖ ఆధ్యాత్మిక, చారిత్రక ప్రదేశాల భద్రతపై కేంద్ర-రాష్ట్ర భద్రతా సంస్థలు సమన్వయం కొనసాగిస్తున్నాయి.

సామ్రాజ్యవాదాన్ని తరిమికొడదాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *