నేటి తెలుగు పత్రిక: ‘మదాలస – స్పేస్ ఫర్ డివైన్ ఆర్ట్’ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగిన ‘భావ రస నాట్యోత్సవం – సీజన్ 1’, అద్భుతమైన స్పందనను సొంతం చేసుకుంది. ఈ ఏడాది జనవరి 4న హైదరాబాద్లోని ఫీనిక్స్ అరేనాలో కన్నులపండువగా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత శాస్త్రీయ నృత్య కళాకారులు సౌజన్య శ్రీనివాస్ గారు, మంజు వి. నాయర్ గారు, స్వప్న రాజేంద్రకుమార్ గారు తమ అసాధారణ నృత్య ప్రతిభతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు.
ఇప్పుడు ‘భావ రస నాట్యోత్సవం – సీజన్ 2’కు రంగం సిద్ధమైంది. ఫిబ్రవరి 28, 2026 సాయంత్రం 6:30 గంటల నుండి హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో ఈ కార్యక్రమం జరగనుంది. ప్రఖ్యాత శాస్త్రీయ నృత్య కళాకారులచే భరతనాట్యం, కూచిపూడి ప్రత్యేక ప్రదర్శనలకు ఈ కార్యక్రమం వేదిక కానుంది.
ప్రదర్శనల వివరాలు:
- కళారత్న సౌజన్య శ్రీనివాస్ గారు – భరతనాట్యం, కూచిపూడి (హైదరాబాద్)
- ప్రమోద్ రెడ్డి గారు & అభినేత్రి ఎన్సెంబుల్ – భరతనాట్యం (హైదరాబాద్)
- ఎం. సురేంద్ర నాథ్ గారు (ఎస్ఎన్ఏ యువ పురస్కార్ అవార్డు గ్రహీత) & డా. బిజినా సురేంద్ర నాథ్ గారు – కూచిపూడి (హైదరాబాద్)
వేదిక:
రవీంద్ర భారతి, లక్డీకాపూల్,
హైదరాబాద్, తెలంగాణ – 500004
తేదీ & సమయం:
ఫిబ్రవరి 28, 2026 | శనివారం
సాయంత్రం 06:30 గంటల నుండి
ప్రత్యేక అతిథులు:
- రవి పాడి గారు
IRTS, చీఫ్ కమర్షియల్ మేనేజర్, దక్షిణ మధ్య రైల్వే - శ్రీ అనుగు నర్సింహా రెడ్డి గారు
డైరెక్టర్, భాషా మరియు సాంస్కృతిక శాఖ - వీర్నాల బాలాజీ గారు
చైర్మన్ – వీర్నాల ఫౌండేషన్
వ్యాఖ్యాత
వాచస్పతి శ్రీ అంబడిపూడి మురళీకృష్ణ గారు
ప్రముఖ తెలుగు యాంకర్, ప్రసిద్ధ వక్త మరియు సాంస్కృతిక వ్యాఖ్యాత
శాస్త్రీయ కళా వైభవానికి అద్దం పట్టేలా ఘనంగా ఈ కార్యక్రమం జరగనుంది.
