Breaking News

ఆలేరు మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణి భాస్కర్ వార్డుల పరిశీలన

యాదగిరిగుట్ట : మార్చి 07 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ కేంద్రంలోని 8,12 వార్డులలో పారిశుద్ధ్య కార్యక్రమాలను 99 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణి భాస్కర్ పరిశీలించారు. ఆయా వార్డుల ప్రజల నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వార్డుల వారీగా సమస్యలతో నివేదికను రూపొందించి పరిష్కార మార్గాలను చూపుతామని ఆమె తెలిపారు.ఆయా కాలనీల పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల ప్రగతిని కూడా చైర్మన్ బాలమణి పరిశీలించారు. మున్సిపల్ కమీషనర్ కె శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అంగడి ఆంజనేయులు, కౌన్సిలర్లు జెట్ట నీరజాసిద్ధులు, జూకంటి సంపత్, మల్లెల సరిత శ్రీకాంత్, పస్తం ఆంజనేయులు, బీజని కళ్యాణి మధు, పాశికంటి సంపత్, బొట్ల సంపత్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఎం ఏ ఎజాస్, నాయకులు ఎగ్గిడి శ్రీశైలం, మోర్తల మోహన్ రెడ్డి, ముదిగొండ శ్రీకాంత్, శికిలం శ్రీను, ఎగ్గిడి అబ్బులు, ప్రజలు పాల్గొన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *