నేటి తెలుగు పత్రిక,09-03-2026,పశ్చిమ గోదావరి: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) అధ్యక్షురాలు వై. ఎస్. షర్మిలా రెడ్డి ఈరోజు మన్రేగా పరిరక్షణ యాత్రలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రక్షించాలనే లక్ష్యంతో ఈ యాత్ర కొనసాగుతోంది.ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం 12 గంటలకు కల్లా మండల కేంద్రంలో నిర్వహించే రచ్చబండ కార్యక్రమంలో ఆమె పాల్గొంటారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో సమావేశమై మన్రేగా అమలు పరిస్థితులపై చర్చించనున్నారు.అదేవిధంగా సాయంత్రం 4 గంటలకు భీమవరం టౌన్లోని ప్రకాష్ చౌక్ వద్ద నిర్వహించే మరో రచ్చబండ కార్యక్రమంలో కూడా పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంది.
