విజయవాడ. మార్చి 14 పశ్చిమ నేటి తెలు గు పత్రిక ప్రతినిధి: ఉత్తర అమెరికా ఏపీ ప్రభుత్వంలో ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం ను ఎమ్మెల్యే సుజనా చౌదరి సన్మానించారు. ఈ సందర్భంగా పోరంకిలో మురళీ రిసార్ట్లో జరిగిన జయరామ్ సన్మానం కార్యక్రమంలో సుజనా చౌదరి పాల్గొన్నారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి శాలువాత కోమటి జయరాంను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాటలాడుతూ జయరాం అమెరికాలో ఏపీ, బెజవాడ ఫుడ్ మర్చిపోకుండా చేశారు. తానా అధ్యక్షులుగా తెలుగు ప్రజలకు అనేక సేవలు అందించారు. ఈ మధ్య అమెరికా వదిలి ఏపీ లో ఉంటున్నారు. కోమటి జయరాం అందరి మనిషిగా ఉంటారు. అందరితో స్నేహంగా, సరదాగా ఉండే వ్యక్తి కి ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మరిన్ని సేవలు అందిస్తారు అని ఆశిస్తున్నాను. ఆయన సేవలకు గుర్తుగా సీఎం చంద్రబాబు నాయుడు ఆయనకు ప్రత్యేక ప్రతినిధి ఇవ్వడం అభినందనీయం అని అన్నారు.
